February 22, 2026

Main Story

Editor’s Picks

Trending Story

ఫిబ్రవరి 22 వికారాబాద్: “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు,సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి గారు, ఏఐసీసీ ఇంచార్జీ కార్యదర్శి సచిన్ సావంత్ గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు,పొన్నం ప్రభాకర్ గారు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు,ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు.

సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి, చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, మీడియా నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు.

ఈ శిబిరం ద్వారా ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత పటిష్టమవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 21 హైదరాబాద్:తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి గారు కేంద్ర‌ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలల్లో కేంద్రం నుండి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. కానీ గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలకు ఇండ్లు మంజురు చేయాలని గడిచిన రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు మంజురు చేయాలని కేంద్రాన్ని కోరారు.

కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.

“గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రంలో గృహ‌ నిర్మాణాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. పది సంవత్సరాలలో సంవత్సరానికి కనీసం పదివేల ఇండ్లను కూడా నిర్మించలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. ఈ ప‌రిస్ధితుల‌ నేపథ్యంలో రెండేళ్ల క్రితం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వ‌చ్చిన మా ప్ర‌భుత్వం పేద‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది దాదాపు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుంది.

తెలంగాణ రాష్ట్రం గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 1.0లో భాగస్వామ్యం కాలేదు. అయితే 2023 తరువాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) మార్గదర్శకాల ప్రకారం PMAY-G 2.0 లో రాష్ట్రం అధికారికంగా చేరింది.

2024 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం PMAY-G 2.0కు ఆమోదం తెలిపి, ఆవాస్+2018 సర్వే నవీకరణ తర్వాత సాచురేషన్ పద్ధతిలో గృహాల మంజూరు చేయాలని నిర్ణయించినప్పటికీ, పాత డేటా ఆధారంగా 2024-25 మరియు 2025-26 సంవత్సరాలకు ఇతర రాష్ట్రాలకు 1.19 కోట్ల గృహాలను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం PMGY 1.0 లో భాగస్వామ్యం కాకపోవడంతో 2018 పెండింగ్ డాటా లేదు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్‌ను సిద్ధం చేసుకుంది. అయినప్పటికీ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరములో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల ఇండ్లను మజూరు చేయాలని” మంత్రి పొంగులేటి గారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి విజ్ఞప్తి చేశారు.

పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందింస్తుందని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 20 హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కోరారు. అలాగే జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చట్టపరమైన రక్షణ చర్యలు రూపొందించే ప్రత్యేక “ఏఐ మంత్రిత్వ శాఖ”ను ఏర్పాటు చేయాలని సూచించారు.

✅ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి గారు కీలకోపన్యాసం చేశారు. భారత ప్రభుత్వం సహకారంతో దేశానికి ఒక “ఏఐ స్టార్టప్ విలేజ్”ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

✅ ఏఐలో శరవేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి నిరంతరం అభివృద్ధిని పర్యవేక్షించే “జాతీయ ఏఐ వార్‌రూమ్” ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. కేంద్రం అనుమతిస్తే అందుకు హైదరాబాద్ కేంద్రంగా వార్‌రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.

✅ ఏఐ పురోగతిలో తెలంగాణతో భాగస్వామ్యం కావాలని సదస్సు ద్వారా ప్రపంచ నాయకులు, సాంకేతిక నిపుణులకు ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలికారు. సామాజిక న్యాయ సాధనకు, పేదరిక నిర్మూలనకు ఏఐను శక్తివంతమైన సాధనంగా వినియోగించాల్సిన అవసరాన్ని ప్రధానంగా నొక్కిచెప్పారు.

✅ వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో ఏఐకి సంబంధించి ప్రతి ఏటా ఒక్కసారి జరిగే చర్చలు సరిపోవని పేర్కొంటూ, దేశంలోని వివిధ నగరాలలో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ సమ్మిట్‌లు నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు.

✅ GPU చిప్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజీ, కోర్ ల్యాంగ్వేజెస్ ఆధారిత సేవల వరకు ఏఐ చైన్ మొత్తం మీద భారతదేశం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు భారత్‌కు స్పష్టమైన రోడ్‌మ్యాప్ అవసరమని పేర్కొన్నారు.

✅ స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడానికి, భారత యువత ప్రపంచ స్థాయి యూనికార్న్ సంస్థలుగా ఎదిగేందుకు ఏఐ రంగంలో ఏమాత్రం జాప్యం చేయకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోకుండా, వారికి మరిన్ని అవకాశాలు సృష్టించేలా సమగ్ర రీ-స్కిల్లింగ్ వ్యూహాలు అమలు చేయాలన్నారు.

✅ గత యంత్రాలు మానవ శారీరక శక్తి ఆధారంగా పనిచేయగా, ఆధునిక GPU చిప్‌లతో నడిచే ఏఐ వ్యవస్థలు విశ్లేషించడం, నిర్ణయించడం, సృష్టించడం, స్వతహాగా చర్యలు చేపట్టడం వంటి మేధో సామర్థ్యాలను కలిగి ఉండటం ముఖ్యంగా రోబోటిక్స్‌ను ఉదహరిస్తూ ఇదొక కీలక మార్పు అని అన్నారు.

✅ కొన్ని దేశాల్లో ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు. సేవల రంగంలో దేశం పురోగతి సాధించినప్పటికీ, ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫార్మ్‌ల సృష్టికర్తగా నిలబడలేకపోయామన్నారు. ప్లాట్‌ఫార్మ్‌లకు సేవలందించే దేశంగా మాత్రమే నిలిచామని పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, మెటా సంస్థలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్ వంటి విస్తృతంగా వినియోగించే సేవలు భారతదేశంలో సృష్టించబడలేదని గుర్తుచేశారు.

✅ భారత్ ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలని రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. దృఢమైన విధానాలు, బలమైన సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా భారతదేశం కేవలం నామమాత్రపు పాత్రలో కాకుండా కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ నాయకుడిగా అవతరించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 20 హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముఖ్య ఉద్దేశము ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే ఎన్నికలు నిర్వహించి, ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని ప్రజాప్రతినిధిగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ప్రతినిధిగా ఎన్నికైన వారు ప్రజాస్వామ్యంలో అధికారాన్ని చేపట్టి తమను ఎన్నుకున్న ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ప్రజలే తమకు నచ్చిన వ్యక్తిని ఓటు ద్వారా గెలిపించి, ప్రజాప్రతినిధిగా అధికార పీఠంపై ఎక్కించి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతుంటారు. ఆ విధంగా వివిధ రకాల పన్నులను ప్రజలపై వేసి, తద్వారా వచ్చిన డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అధికారం చేపట్టిన వారు చేస్తుంటారు. అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల ద్వారా ఎన్నికై, తిరిగి అదే ప్రజల కోసం ప్రజాప్రతినిధులు పని చేయాల్సి ఉంటుంది. నేటి ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు అంటే అర్థం మారిపోయింది. “ఓడ దాటే దాకా ఓడ మల్లయ్య ఓడ దాటినాక బోడి మల్లయ్య” అన్న సామెత చందాన ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పెద్దలు తిరిగి అదే ప్రజల నెత్తిన కూసుని తాము ఆడింది ఆట, తాము పాడింది పాట అంటూ ఐదు సంవత్సరాలు వారికి నచ్చిన విధంగా పాలన అందిస్తారు. అయితే నిజాయితీతో ప్రభుత్వాన్ని నడిపి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడ్డ ప్రజాప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారు. లేదంటే ఈసారి ఎన్నికలు జరిగినప్పుడు వారికి తగిన బుద్ధి చెప్పి ఓటమి పాలు చేస్తారు. అంటే అధికార పీఠంపై కూర్చో పెట్టాలన్న అధికార పీఠం నుంచి గుంజి పడేయాలన్నా ఓటరే కీలకం. అలాంటి కీలకమైన ఓటరు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ఒక కీలుబొమ్మలాగా మారిపోయాడని వ్యాఖ్యానాలు సర్వదా వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి, ప్రజలను గాలికి వదిలేసి తమ సొంత సంపాదన కోసం అర్హులు సాస్తున్న ప్రజాప్రతినిధులే నేటి ప్రజాస్వామ్యంలో ఎక్కువగా కనబడటం విడ్డూరం , శోచనీయం. అంటే ప్రజాస్వామ్యం ఎన్నికల విధానంలో చట్టసభలోకి పోతున్న లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కోఆప్షన్ సభ్యులు ఇలా ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా తమ తమ స్థాయిలో, తమకు కేటాయించిన ప్రాంతంలో, తాను గెలిచి వచ్చిన ఏరియాలో, తమ నియోజకవర్గంలో, తమ జిల్లాలో, తమ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి, మౌలిక వసతులను కల్పించాలి, తద్వారా సంక్షేమ పథకాలు అందించి తమ తమ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెల్లించాలి. ఇలాంటి ఒక గొప్ప మహత్తరమైన, కీలకమైన, ప్రాధాన్యత గల ప్రజా ప్రతినిధిగా ఉండి ఎవరు ఎంత మేర ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి అనే పదానికి న్యాయం చేస్తున్నారో వారు గుండెల మీద చేయి వేసుకొని నిస్వార్థంగా చెప్పవచ్చు, వారి సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు గమనించవచ్చు. ప్రపంచంలోనే అనేక దేశాలలో ప్రజాప్రతినిధులు ఎలాంటి గొప్పలకు పోకుండా, సాదాసీదాగా వ్యవహరిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెజార్టీ ప్రజా ప్రతినిధులు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తారు. అందుకు భిన్నంగా భారతదేశంలో మాత్రం ప్రతి ప్రజా ప్రతినిధి వెనుక ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక వర్గం అనే ముద్ర వేసుకొని నా వారు, నా మనుషులు, నా కులం, నా మతం అంటూ పేరు చివరన తోకలు తగిలించుకొని రాజకీయాలు చేస్తుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల, మత జాడ్యం ఇండియన్ పొలిటికల్ సిస్టం లోనే ఇమిడి ఉండటం విడ్డూరంగా ఉంది.

ఎన్నికల వరకే పార్టీ లు… గెలిచిన తర్వాత నిష్పక్షపాతంగా ప్రజా సేవ

ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాలంటే ఎన్నికలలో పోటీ చేయక తప్పదు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలకు మద్దతునిస్తూ, పార్టీల వారీగా విభజింపబడి, చీలిపోయి, ఎవరి పార్టీ అభ్యర్థికి వారు ఓట్లు వేసుకొని గెలిపిస్తుంటారు. ఎన్నికలలో ఒకసారి గెలిచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఈ భారత ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధిని గౌరవిస్తారు. ప్రజా ప్రతినిధులు కూడా పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ, తమ తమ ప్రాంతాలను అభివృద్ధి పథంలో పయనింప చేస్తుంటారు. అంటే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ నేటి కుట్రా జకీయం స్వార్థపు దారిలో పయనిస్తూ నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నీది ఆ ప్రాంతం, నాది ఈ ప్రాంతం, నీది ఆ కులం, నాది ఈ కులం, నీది ఆ మతం, నాది ఈ మతం అంటూ విద్వేషాలను నెత్తికెత్తుకుని ఆరని మంటల జ్వాలలను ప్రజల మధ్యన కులం, మతం, పార్టీల పేరున రగిల్చి ప్రజలు తన్నుకుంటుంటే, కొట్టుకు చస్తుంటే ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు తప్పించి వారించిన, నివారించిన పరిస్థితులు చాలా తక్కువ అని చెప్పవచ్చు. పార్టీలకు అతీతంగా ఎలాంటి కులమత వర్గ బేధాలు చూపెట్టకుండా, అందరిని సమాన దృష్టితో చూస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, అర్హులైన ప్రతివారికి ప్రభుత్వ పథకాలు అందజేస్తూ, అన్ని ప్రాంతాలను అభివృద్ధి దిశలో స్వార్ధ రహితంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాల్సిన ప్రజాస్వామ్యం అక్రమాలు, అవకతవకలు, అవినీతి, దాడులు, దౌర్జన్యం, కొట్లాటలు, దొమ్మిలు, బగ్గు మంటున్న రాజకీయ కక్షలు, రావణ కాష్టం లా రగిలే ప్రాంతాలు, అల్లర్లతో అట్టుడికి పోయే కులమత ఘర్షణలు, మోగుతున్న బాంబులు, దూ స్తున్న కత్తులు, దద్దరిల్లుతున్న పరిసరాలు, ఒకరిపై ఒకరు ఆరోపణస్త్రాలు, మత విద్వేషాలు పురి గొలుపుతూ, ఈ విధంగా తాము పబ్బం గడుపుకోవడానికి ప్రజాప్రతినిధులు అనబడే రాజకీయ నాయకులు ప్రజల మధ్యనే చిచ్చులు పెట్టి, ఉచ్చులు బిగించి, ఒకరికొకరు ప్రాణాలు తీసుకునేలాగా ఉసిగొలుపుతూ చోద్యం చూస్తున్నారు తప్పించి, ప్రశాంతమైన పరిపాలన అందించడంలో విఫలమయ్యారనే భావనలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో నైనా ఉన్న ఓ ప్రజా ప్రతినిధులారా, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించండి, ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు పని చేయండి. ఎన్నికల వరకే రాజకీయాలు అన్న సంగతిని గ్రహించండి, వంట పట్టించుకోండి, ప్రజల కొరకు పనిచేసే ప్రజల హృదయాలలో మీ పేరు చిరస్థాయిగా ఉండేలాగా కృషి చేయండి. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన న్యాయం చేయండి. అందుకు తగ్గట్టుగా హుందాతనంతో వ్యవహరించండి. చిల్లర మల్లర రాజకీయాలకు స్వస్తి పలకండి. ప్రజలందరూ నా వారే అనే ఒక విశ్వభావనకు తెర తీయండి. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించి, డబ్బు సంపాదనను తృణప్రాయంగా భావించి ఎంతోమంది మీకంటే ముందు రాజకీయాలలో ఉన్నవారు నేటికీ ప్రజల హృదయాలలో మెలుగుతూనే ఉన్నారు. మీరు కూడా చచ్చినాక ప్రజలు గుర్తుంచుకునే విధంగా నీతి, నైతికత, నిజాయితీలతో సూపర్ పాలకులుగా మారండి. కేవలం ఎన్నికలలో ఖర్చుపెట్టిన డబ్బును తిరిగి సంపాదించడానికి కాకుండా ప్రజల అభిమానాన్ని సంపాదించి ప్రజల చేత గౌరవం పొందే లాగా జీవించండి. ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, సంక్షేమం అందించాలని, ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ఓటర్లైన పౌరులుగా మనమూ కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 19 ముంబాయి: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఒక నమూనాగా నిలబెడతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు.

❇️ ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన “ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో నీతి ఆయోగ్ (NITI Aayog) వైస్ చైర్మన్‌గా శ్రీ సుమన్ బేరీ గారు, ఇతర అతిథులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు.

❇️ గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని, తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయన్నారు.

❇️ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుండి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని చెప్పారు.

❇️ రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను CURE, PURE, RARE జోన్‌లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్‌ చుట్టూ 160 కి.మీ. పొడవున్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) జోన్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.

❇️ ప్యూర్ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి “చైనా +1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ తయారీ వృద్ధి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా, 360 కిలోమీటర్ల పొడవున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

❇️ తెలంగాణ విద్యుత్ వినియోగంపై మాట్లాడుతూ, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ వాటా 25 శాతంగా ఉందని తెలిపారు.

❇️ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, శక్తి, ఉపాధి, వ్యవస్థాపకత (Entrepreneurship) మధ్య సమతుల్యతను సాధిస్తూ, గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 18 హైదరాబాదు: స్నేహితుల కొరత.! ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్నేహితుల కొరత ఏర్పడింది. 1960 ప్రాంతంలో ఒక్కక్కరికి 100 మంది స్నేహితులు ఉండేవారట. 1990 లలో ఒక్కొక్కరికి 50 మంది స్నేహితులు ఉండేవారు.
2020 నాటికి 10 మంది ఉన్నారు.ఇప్పుడు ఒక్కరు ఉండటం కూడా గగనమే.దేశంలో 12% జనాభాకు స్నేహితులు లేరని ఒక సర్వేలో తేలింది.స్నేహితులతో ముఖాముఖి గడిపే సమయం గతంలో 1 గంట ఉంటే ప్రస్తుతం 35 నిమిషాలకి పడిపోయింది.

మంచి స్నేహితులు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి వారు.

స్నేహితులు లేనివారు రోజుకు 20 సిగరెట్లు తాగినంత స్ట్రెస్ అనుభవిస్తారట.

మంచి స్నేహితులు ఉన్నవారిలో blood pressure, గుండె వ్యాధులు తక్కువని పరిశోధనలు తెలుపుతున్నాయి.
స్నేహితులు తోడుగా ఉన్నవారు ఆహ్లాదంగా ఉంటారు, వ్యాయామం, క్రీడలు, ఇతర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వారి సాంగత్యంలో మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కానీ స్నేహితులు ఊరికినే ఏర్పడరు. స్నేహానికి సమయం పెద్ద investment . కనీస పరిచయం ఏర్పడాలంటే 40 గంటలు కలసి గడపాలి, ఒక మాదిరి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 90 గంటలు, గట్టి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 40 గంటలు కావాలట. మన దగ్గర ఇంత సమయం ఉందా ఇప్పుడు.

ఒకసారి మంచి స్నేహం ఏర్పడ్డాక దానిని నిలుపుకోవాలంటే రోజూ కొంత సమయం కేటాయించాలి.

ఇక మనం పని చేసే ప్రాంతంలో మనం స్నేహం అనుకునేది చాలా వరకు ఉపరితల ముచ్చటే. ఇక ఫేస్ బుక్, వాట్సాప్ స్నేహాలు చొప్పదండూ ముచ్చటే!!
బార్ & రెస్టారెంట్ స్నేహాలు మత్తు ఉన్నంత వరకే

మొత్తం మీద స్నేహానుబంధాలు తగ్గిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ,
సమయం లేదు మిత్రమా!

అనేదే అతి పెద్ద కారణం!!

సమయాన్ని కేటాయించండి. మంచి స్నేహాలను పెంపొందించుకొండి.

కనీసం ఉన్న స్నేహాలను నిలుపుకొండి!!!
🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 18 శ్రీకాళహస్తి: విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు జిల్లా స్థాయిలో తిరుపతిలో జరిగిన అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో మొదటి మూడు స్థానాలను అబాకస్ మూడు లెవెల్స్ లో, మరియు వేదిక్ మాథ్స్ మూడు లెవెల్స్ లో కూడా గెలుపొంది సత్తా చాటారు .పాఠశాల డైరెక్టర్ శ్రీ కాయం సుబ్బరామిరెడ్డి విద్యార్థులను అభినందించి వాళ్లకి సర్టిఫికెట్లను, మోమెంటోలు అందించారు. వేదిక్ మాథ్స్ కేటగిరీ లో, ఎనిమిదవ తరగతికి చెందిన ఎ.బి. డిల్లినాథ్, ఏడవ తరగతికి చెందిన ఎం.అరవింద్, ఎనిమిదవ తరగతికి చెందిన ఆర్. రిషిత శ్రీ., అబాకస్ కేటగిరీలో కె. కేతన్, కె. గగన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనందుకు ప్రిన్సిపాల్ రామ్.ఉమా సింగ్ విద్యార్థులను అభినందించి, రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలలో కూడా తమ సత్తా చాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హైదరాబాద్, ఫిబ్రవరి 17:కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న,మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా, ఎంప్యానల్‌మెంట్ చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఆయా పత్రికల జర్నలిస్టులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సమాచార పౌరసంబధాల శాఖ కమీషనర్ కార్యాలయం
(సమాచార భవన్) ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిన్న, మధ్య తరహా పత్రికల నిర్వహకులు, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు దాదాపు రెండు గంటల పాటు కార్యాలయం ప్రవేశ ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)
వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికల అణచివేత కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి 44 వేలకు పైగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, కేవలం ఎంపానల్మెంట్ అయిన కొన్ని పత్రికలకు,చానళ్ళకు మాత్రమే ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న అన్ని పత్రికలకు ఆయా పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులిచ్చే వారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పద్దతిని తుంగలో తోక్కి పత్రికలకు ఎంప్యానల్ ముసుగు తొడిగి, నిబంధనల పేరుతో చిన్న,మధ్య తరహా పత్రికలను పాతాళానికి తొక్కారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే చిన్న మధ్య తరహా పత్రికలకు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వం జర్నలిస్టులకు చేసిన అన్యాయంపై ఆనాడు గొంతెత్తిన ఈనాటి పాలకులు అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా…అనేక పత్రికలను ఎంపానల్మెంట్ చేయకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారనని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ సరైన న్యాయం చేస్తామని నమ్మబలికిన పాలకులు మీడియా అక్రిడిటేషన్ ల విషయంలోనే వివక్ష చూపుతూ చిన్న మధ్య తరహా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ గుర్తింపు ఉన్న పత్రికలను ఎంప్యానల్ చేయకుండా రెండేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కనీసం అక్రెడిటేషన్లు ఇవ్వకుండా అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ఎంప్యానల్ లిస్టులో ఉన్న చాలా పత్రికలను ఆ జాబితా నుంచి తొలగించి జర్నలిస్టులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సందర్బాన్ని బట్టి దరఖాస్తు చేసుకుంటే అడ్వర్టయిజ్మెంట్ తో పాటు అక్రెడిటేషన్ ఇచ్చే వారని, ప్రస్తుతం అడ్వర్టయిజ్మెంట్ల సంగతి దేవుడెరుగు గానీ…కనీసం అక్రెడిటేషన్ కార్డు ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ వివక్ష కారణంగా స్వరాష్ట్రంలో చిన్న పత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని, దీని వల్ల ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులకు పత్రికల నిర్వహణ భారమవుతుందని అన్నారు. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు ఎంప్యానల్‌లో ఉన్న పత్రికలను ఆ జాబితా నుంచి తొలగించడం చాలా భాదాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ
రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రతి పత్రికకు అక్రిడిటేషన్‌ కార్డులు గతంలో మాదిరిగా ఇవ్వాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయా పత్రికలకు ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక అడ్వర్టయిజ్మెంట్ ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్ కోసం ఒక ఎకరం భూమిని ప్రభుత్వ నామినల్ ధరకు ఇచ్చి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఉన్న జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు,భీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్, కె. పాండురంగారావు, పద్మనాభరావు, యర్రమిల్లి రామారావు,హైదరాబాద్ జిల్లా నాయకులు వి.రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సంతోష్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, గడ్డమీది అశోక్, నాయకులు డప్పు రామస్వామి,శంకర్, శివకుమార్,సంజీవ్ కుమార్, మంజులారెడ్డి, సౌభాగ్యవతి, సుష్మిత, శివపార్వతి, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, నిజామాబాద్ జిల్లా నేతలు కుంచెం శ్రీనివాస్,
పానుగంటి శ్రీనివాస్, యార్వ నరేష్,మహాదేవ్ ప్రసాద్ రాజు, నల్గొండ జిల్లా నాయకులు వెలుతురు యాదయ్య, జీడిమట్ల రవీందర్, నాగయ్య, పరమేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ జగన్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 17 సూర్యాపేట రూరల్: జన్మనిచ్చిన తల్లి,అక్షర జ్ఞానం అందించిన బడి, ప్రయోజకుడి గా మార్చిన గ్రామం, ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో స్థిర స్థాయిగా నిలిచిపోతాయి. దీనిలో తమకు అక్షర జ్ఞానాన్ని అందించిన ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయుటకు పూనుకున్నారు… సూర్యాపేట మండల పరిధిలోని తాళ్లఖమ్మంపహడ్ గ్రామానికి చెందిన యువకులు. సమాజ సేవకులుగా మారి గ్రామంలోని దేవిరెడ్డి రాంరెడ్డి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి బాటలు వేశారు. పేద పిల్లలు చదివే పాఠశాలను మరింత అభివృద్ధి చేయుటకు చేయి చేయి కలిపి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. “సుమారు రెండు లక్షల వ్యయంతో” గ్రామంలోని 20 మంది యువకులు ఏకమై స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పెయింటింగ్ వేయించేందుకు గాను తమ వంతుగా తలా కొంత డబ్బులు జమ చేసి సుమారు రెండు లక్షల వ్యయంతో తరగతి గదులతో పాటు, పాఠశాల భవనానికి అందమైన రంగులను వేయించారు. పాఠశాలకు రంగులు వేయించడంతో పాటు తరగతి గదులపై విద్యార్థులకు ఉపయోగపడే రకరకాల అందమైన బొమ్మలను వేయించారు. “అందరి మన్ననలు పొందుతున్న యువత” చేతిలో రూపాయి ఉంటే ఎన్నో వ్యసనాలకు నేటి యువత బానిస అవుతుంటే అందుకు విభిన్నంగా నిలిచారు. తాళ్లఖమ్మంపహడ్ గ్రామానికి చెందిన యువత. ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలోని ఉన్నత పాఠశాలకు పెయింటింగ్ వేయకపోవడంతో పాఠశాల భవనం, తరగతి గదులు అద్వానంగా తయారయ్యాయి. క్రమంలో గ్రామానికి చెందిన యువకులు ఏకమై తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నత పాఠశాల తరగతి గదులతో పాటు పాఠశాల భవనానికి పెయింటింగ్ వేయించడంతో పాఠశాల భవనం ఎంతో అందంగా రూపుదిద్దుకుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ పాఠశాలను రంగుల మయంగా మార్చడంతో యువతను గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. “గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు సైతం” గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు. పెయింటింగ్ వేయించడంతో పాఠశాల భవనం నూతన కళ సంతరించుకుంది. దీంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు, ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాథమిక పాఠశాలకు సైతం పెయింటింగ్ వేయించి అందంగా తీర్చిదిద్దేందుకు యువత ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గ్రామ యువత తీసుకుంటున్న నిర్ణయాల పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ యువతను శభాష్ అని మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫిబ్రవరి 17 హైదరాబాద్: వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు బయోఏషియా-2026 సదస్సు వేదికగా జీవవిజ్ఞాన రంగానికి చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీలు, శాస్త్రవేత్తలు, నిపుణులకు పిలుపునిచ్చారు.

✳️ తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతోందని, ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌ను ఇప్పుడు అందరం కలిసి సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని కోరారు.

✳️హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా (BioAsia 2026) అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు.

✳️ ప్రధానంగా ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

✳️ “ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవవైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతుంది. అందుకు తెలంగాణ ఉంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.

✳️ “జీవవైజ్ఞానిక రంగంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక మార్పులను గమనిస్తే, పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం ఉంది. ఆయా సంస్థలు, కార్పొరేట్లు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు.

✳️ ఆ వాతావరణాన్ని తెలంగాణ అందిస్తుంది. అందుకు హైదరాబాద్ అనుకూలమైంది. బల్క్‌డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచస్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంది.

✳️ తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. GCC లను స్థాపించండి. ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించండి. మాలిక్యూల్స్ , ఔషధాలను డిజైన్, క్లినికల్ అనలిటిక్స్‌ను ప్రారంభించండి. AI ప్లాట్‌ఫామ్‌లను, డిజిటల్ తయారీ రంగాలను ముందుకు తీసుకెళ్లండి. అందుకు ప్రభుత్వం, యంత్రాంగం, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయంలో భాగస్వాములుగా ఉంటారు.

✳️ 23 ఏళ్ల కిందట బయోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్ వేర్ నగరంగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా కూడా నిలిచింది.

✳️ దూరదృష్టి కలిగిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగింది.

✳️ తెలంగాణలో గడిచిన రెండేళ్లలో జీవవిజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా తెలంగాణ నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం. జినోమ్ వ్యాలీని విస్తరించాం. అలాగే, ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణల కోసం వన్-బయోను ప్రారంభించాం.

✳️ జీవవైజ్ఞానిక రంగంపై మా ఆలోచనలను తెలంగాణతో పాటు మీ అందరితో పంచుకుంటున్నాను. ఇటీవలే మేం “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ఆవిష్కరించాం. తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది మా లక్ష్యం.

✳️ గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేస్తూ అనేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆహ్వానించాం. ఒక బలమైన సంకల్పంతో ఈ పురోగతిని సాధించాం. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే బయోఏషియా-2026 సదస్సు.

✳️ ఇప్పుడు బయోఏషియా తన పరిధిని విస్తరించుకుని “బయోవరల్డ్‌”గా మారుతోంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలు, దాదాపు 4 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, హెల్త్‌కేర్ రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ సదస్సులో పాల్గొన్నారు.

✳️ హైదరాబాద్ లో లో జరుగుతున్న ఈ BioAsia సదస్సు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న విశ్వాసం నాకుంది” అని ముఖ్యమంత్రి గారు పేర్కొంటూ, ప్రపంచ నలుమూలల నుంచి బయోఏషియా సదస్సుకు హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికారు.

✳️ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్ గారికి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు-2026 అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed