శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం
జూలై 2: జూలై 04 LB స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేయు భారీ బహిరంగ సభకు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. కార్యక్రమాని విజయవంతం చేయుటకై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీష్ గౌడ్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.