April 17, 2026

​36 ఏళ్ల నిరుపమాన సేవకు నిలువెత్తు నిదర్శనం.. ఖాకీ వనంలో వికసించిన అరుదైన పుష్పం లక్ష్మణ్

0
IMG_20260104_053104

మెదక్ ప్రతినిధి – సంతోష్ చారి:లక్ష్యం పట్ల అచంచలమైన అంకితభావం, వృత్తి పట్ల నిబద్ధత ఉంటే సామాన్యుడు సైతం అసాధారణ శిఖరాలను అధిరోహించవచ్చని మెదక్ జిల్లా ముద్దుబిడ్డ వడ్ల లక్ష్మణ్‌ నిరూపించారు. పాపన్నపేట మండలం, మల్లంపేట అనే చిన్న మారుమూల గ్రామం నుండి ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత ‘సేవా పథకం’ అందుకోబోతుండడం జిల్లాకే గర్వకారణం.​తుపాకీ గురిలో ‘టాపర్’.. అప్పట్లోనే అద్భుతం!
వడ్ల లక్ష్మణ్ విజయయాత్ర నిన్న మొన్న ప్రారంభమైంది కాదు. 1989లో పోలీస్ శిక్షణ (Training) పొందుతున్న కాలంలోనే ఆయన తనలోని అసమాన ప్రతిభను ప్రపంచానికి చాటారు. తుపాకీ గురి పెట్టడంలో (Firing) అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి, తన బ్యాచ్‌లోనే ‘టాపర్‌’గా నిలిచి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆనాడు శిక్షణలో చూపిన అదే గురిని, పట్టుదలను తన 36 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలోనూ కొనసాగిస్తూ ‘మచ్చలేని అధికారి’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.​అంచలంచెలుగా ఎదిగిన ‘కర్మయోగి’ పేదరికం ఆయన సంకల్పం ముందు చిన్నబోయింది. ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో జన్మించిన లక్ష్మణ్, పేదరికాన్ని అనుభవిస్తూనే పట్టుదలతో చదివి పోలీస్ శాఖలో చేరారు. కేవలం సీనియారిటీతో కాకుండా, తన పనితీరునే పదోన్నతులకు మెట్లుగా మార్చుకున్న ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం:1989: పోలీస్ కానిస్టేబుల్‌గా కొలువులో చేరిక.
​2011: విశిష్ట సేవలతో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి. 2017: ఏఎస్‌ఐ (ASI)గా బాధ్యతల స్వీకారం. 2025 జనవరి: సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా అత్యున్నత స్థాయికి చేరిక. ​ఇంటెలిజెన్స్ విభాగంలో ‘నిశ్శబ్ద పోరాటం’ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్, ప్రభుత్వానికి అత్యంత విశ్వసనీయమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. క్లిష్టమైన సమాచార సేకరణలో, విశ్లేషణలో ఆయన చూపిన చాకచక్యం అమోఘం. మచ్చలేని 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో, సుమారు 11 ఏళ్ల పాటు ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన అందించిన నిస్వార్థ సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ గణతంత్ర దినోత్సవం వేళ ఆయనను సముచిత రీతిలో గౌరవిస్తోంది.
​బహుముఖ ప్రజ్ఞాశాలి.. క్రీడల్లోనూ కింగ్!
​ఖాకీ దుస్తుల వెనుక ఒక గొప్ప క్రీడాకారుడు కూడా ఉన్నారు. 1991లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్‌లో ఫుట్‌బాల్ విజేతగా నిలిచి, అప్పటి మెదక్ ఎస్పీ సాంబశివరావు గారి చేతుల మీదుగా ‘విన్నర్ కప్’ అందుకున్నారు.
​పురస్కారాల పంట: ఇప్పటివరకు 14 నగదు బహుమతులు, 5 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, పలు ప్రశంసా పత్రాలు ఆయన కార్యదక్షతకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
​యువతకు దిక్సూచి..మల్లంపేట కీర్తి కిరీటం
​ఒక సామాన్య కానిస్టేబుల్‌గా జీవితాన్ని ప్రారంభించి, రాష్ట్ర స్థాయి సేవా పతకాన్ని పొందే స్థాయికి ఎదగడం అనేది నేటి తరం యువతకు ఒక గొప్ప పాఠం. పేదరికం ఎదుగుదలకు ఆటంకం కాదని, నిరంతర శ్రమ ఉంటే ఆకాశమే హద్దు అని లక్ష్మణ్ గారు చాటిచెప్పారు. ఈ నెల 26న ఆయన అందుకోబోయే పురస్కారం మల్లంపేట గ్రామ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed