February 22, 2026

ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ లపై నిషేధం విధించిన నేపాల్… కారణం ఇదే!

0
IMG-20250905-WA4127

సెప్టెంబర్ 5 హైదరాబాద్:నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం,నిషేధిత జాబితాలో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్.ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే ప్రధాన కారణం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ కఠిన చర్యలు,గతంలో టిక్‌టాక్‌పైనా వేటు వేసిన నేపాల్ సర్కార్.రిజిస్ట్రేషన్ చేసుకుంటే నిషేధం ఎత్తివేతకు అవకాశం,ప్రముఖ సోషల్ మీడియా సైట్లపై నేపాల్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో సహా మొత్తం 26 సామాజిక మాధ్యమ సంస్థల సేవలను దేశంలో నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోవడమే ఈ నిషేధానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను తక్షణమే నిలిపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతోనే…!

దేశంలో పనిచేస్తున్న అన్ని సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని, అనుచిత కంటెంట్‌ను పర్యవేక్షించాలని నేపాల్ సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. 2020 నుంచి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు, ‘సోషల్ మీడియా రెగ్యులేషన్ డైరెక్టివ్’ ప్రకారం ప్రభుత్వం అన్ని సంస్థలకు ఏడు రోజుల గడువు ఇచ్చింది. అయితే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, రెడ్డిట్ వంటి 26 ప్రధాన కంపెనీలు ఈ గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో వాటిపై నిషేధం విధించాలని నేపాల్ టెలికమ్యూనికేషన్ అథారిటీకి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

షరతులతో కూడిన నిషేధం

ఈ విషయంపై సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. “సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నాం. గడువులోగా నమోదు చేసుకోని వాటిని నిలిపివేయాలని సూచించాం. అయితే, ఇది శాశ్వత నిషేధం కాదు. కంపెనీలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వెంటనే వాటి సేవలను పునరుద్ధరించడానికి అనుమతిస్తాం” అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుచిత కంటెంట్‌ను నియంత్రించడం, దేశంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొంది.

గతంలో కూడా నేపాల్ ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. 2023లో సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తోందన్న కారణంతో టిక్‌టాక్‌పై నిషేధం విధించింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed