December 24, 2025

వనపర్తి మున్సిపాలిటీ నీ ఆదర్శ మున్సిపాలిటీ గా మారుద్దాం.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

0
IMG-20250703-WA1693

వనపర్తి మున్సిపాలిటీ నీ ఆదర్శ మున్సిపాలిటీ గా మారుద్దాం.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

రూ.234 కోట్ల తో నియోజకవర్గం అభివృద్ధికి కంకణ బద్దులమై పనిచేస్తున్నాం

వనపర్తి అభివృద్ధి కి కంకణ బద్దులమై పనిచేస్తున్నామని నియోజకవర్గం శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే మేఘారెడ్డి,ఆర్డీవో తాశీల్దార్
మున్సిపల్ కమిషనర్ తో కలిసి వనపర్తి జిల్లా కేంద్రంలో నీ వివేకానంద కూడలి నుండి రామాలయం వరకు మార్నింగ్ వాక్ చేపట్టారు. వ్యాపార,వాణిజ్య,సముదాయజమానులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కి అవసరమైన రూ.234 కోట్ల ప్రణాళికల నివేదికలను సీఎం దృష్టి కి తీసుకెళ్లామని తెలిపారు

మూడు సంవత్సరాల వ్యవదిలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ వనపర్తి మునివిపాలిటీ నీ ఆదర్శ్ మున్సిపాలిటీ గా మారుస్తామన్నారు.వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు,వ్యాపారం,వాణిజ్య సముదాయాల యజమానులు సహకరించాలని కోరారు.మూడు నెలలో రూ.50 కోట్లతో 20 సీసీ రోడ్డు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించామన్నారు.హిందూ స్మశానా వాటిక,రోడ్లు,మంచినీటి సరఫరా,డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మున్విపాల్ ఆధి కారులను ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం,తాశీల్దార్ రమేష్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు,మున్విపాలిటీ సిబ్బంది,అర్.అండ్ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed