యోగాచార్య ధర్మవీర్ సంస్మరణ సభలో పాల్గొన్న టిపిసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి
మహేశ్వరం జనవరి 4: మహేశ్వరం నియోజకవర్గం* రామకృష్ణాపురం డివిజన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రిటైర్డ్ అయిన అల్కాపురి కాలనీ పతాంజలి యోగా కేంద్రం సేవలు అందించి యోగ గురువువర్యులు *శ్రీ యోగాచార్య ధర్మవీర్ సంస్మరణ సభలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి. సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, 👉ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ధర్మవీర్ విశ్రాంతి తీసుకోకుండా, యోగా ద్వారా సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అల్కాపురి కాలనీ పతంజలి యోగా కేంద్రం ద్వారా ఎంతో మందికి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందించిన ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో అల్కాపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు *వంశీ* సెక్రెటరీ శ్రీనివాస్ రావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.