December 24, 2025

విద్యార్థుల మానసిక ప్రతిభకు వేదికగా సిప్ ప్రాడిజీ పోటీలు

0
IMG-20250702-WA0864

జులై 02:శంషాబాద్లోని కోస్మిక్ కన్వెన్షన్ – 3 లో ఆదివారం 29-06-25 ఉదయం 21వ తెలంగాణ ప్రాంథియ సిప్ అబాకస్ ప్రాడిజీ పోటీలు 2025 లో 85 కేంద్రాల నుండి 3100 మంది బాల బాలికలు పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా బాల బాలికల మెదడు సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాన ఉద్దేశంతో సిప్ అబాకస్ నిర్వహించే ఈ పోటీ మనసు,మానసిక చాతుర్యాన్ని పెంపొందించేందుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సిప్ అబాకస్ పోటీలో విద్యార్థులు అబాకస్,మానసిక అబాకస్ తదితర మాడ్యూల్స్‌లో ప్రశ్నలకు తక్కువ సమయంలో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా జరిగిన మానవ కాలిక్యులేటర్ అనే ప్రదర్శనలో పిల్లలు 11 సెకన్లలో 100కి పైగా అంకెలను జోడించి సమాధానాలు చెప్పగలగడం విశేషం.సిప్ అబాకస్ నేషనల్ కోఆర్డినేటర్ నాగేశ్ మాట్లాడుతూ:-14 మంది పిల్లలు విజయసాధించడం గర్వకారణమన్నారు.వీరిలో ప్రథమ స్థానం రితిక బాచుపల్లి (ప్రగతి సెంటర్),కాలనల్ పబ్లిక్ స్కూల్ సడలోన్ సత్కారం పొందిన రమేష్ కుమార్ కుమారి గుంజి సాక్షి,టిట్టు సౌందర్య,సాయి బోజు జాయితి (రెండవ స్థానం సాధించినవారు) పాల్గొన్నారు.ఇక మూడవ స్థానం లో దాకొంత ప్రసన్నమాధవ్,హిమబిందు రాజు,సల్మాన్ మోహం,కాన్సల వెళ్ళోలీ,అద్విత ఆద్విత్,హన్మంత రావు,అభిషేక్,వేదుల అభిలాష్ రెడ్డి,ప్రదీప్ సింగ్ నిలిచారు.ఈ విజయాన్ని నేషనల్ నాగేశ్ ప్రోత్సహించగా,డైరెక్టర్ ఎం.వసంత, ఎం.పుష్ప, టీమ్స్ అభినందనలు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed