తెలంగాణ కాంగ్రెస్ “జనహిత” పాదయాత్రకు సర్వం సిద్ధం
జూలై 31 హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు (ఎమ్మెల్సీ) మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్న “జనహిత” పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది నేటి సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రారంభంకానున్న జనహిత పాదయాత్ర “జనహిత” పాదయాత్రలో టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి తో కలిసి పాదయాత్రలో పాల్గొననున్న ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ టిపీసీసీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు పరిగి నుంచి ఖానాపూర్ వరకు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 4వ తేదీ ఖానాపూర్ లో ముగియనున్న మొదటి విడత పాదయాత్ర. ఇప్పటికే పాదయాత్ర ప్రారంభ ప్రాంగణం కటౌట్లు, ప్లెక్సీలతో ప్రచార కార్యక్రమాలు.భారీగా తరలి వచ్చి పాదయాత్ర లో పాల్గొననున్న కాంగ్రెస్ శ్రేణులు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ ని సంస్థాగత నిర్మాణం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.