December 24, 2025

ఎన్నికల తరువాత ఓటర్ల జాబితాలపై కుట్రపూరితంగా తీసుకొచ్చిన SIR (Special Identification Revision) పై పార్లమెంట్ ఎదుట గళమెత్తిన ఎంపీ వంశీకృష్ణ, ప్రియాంక గాంధీ

0
IMG-20250728-WA1469

జూలై 28 న్యూ డిల్లీ: న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణం ఒక్కసారిగా ఉరుకులు పరుగులతో మార్మోగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ నేతృత్వంలో, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి SIR ప్రక్రియపై తీవ్ర నిరసన తెలిపారు. ప్రజల అభిప్రాయం లేకుండా, ఎన్నికల తర్వాత ఓటర్లను మత, కుల ప్రాతిపదికన వడపోసే ఈ ప్రయత్నాన్ని “ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర”గా వర్ణించారు. ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్ ముందు స్పష్టం చేశారు: “ఇది ఓటర్లను వర్గీకరించే, ఎన్నుకున్న ప్రభుత్వాన్ని డీలా చేసే కుట్ర. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం బహిరంగంగా పోరాడతాం.ప్రియాంక గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చెప్పారు: “ఓటర్లను తీసేయడం కాదు. వారి గొంతుకను వినడమే ప్రభుత్వ బాధ్యత.ఈ నిరసన కార్యక్రమం దాదాపు గంటపాటు సాగింది. మీడియా, ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. వంశీకృష్ణ పోరాట ధోరణి, ప్రియాంక గాంధీ స్పష్టమైన నేతృత్వం కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది.ఓటరు హక్కు కోసం – పౌర హక్కు కోసం – పార్లమెంట్ గేట్ ఎదుట గళమెత్తిన గడ్డం వంశీకృష్ణ ఈ పోరాటంలో ముందు వరుసలో నిలబడ్డారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed