ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA విజయం 152 ఓట్ల మెజారిటీతో గెలుపు
Oplus_131072
సెప్టెంబర్ 9 న్యూఢిల్లీ:ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన ప్రత్యర్థి పై 152 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ఫలితాలను ప్రకటించారు. ప్రత్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. ఎన్నికల లెక్కింపు రాత్రి 6 గంటలకు ప్రారంభమైంది. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. పదిహేను చల్లని ఓట్లు పడ్డాయి. సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి.