మహేశ్వరం నియోజకవర్గ పర్యటన లో తెలంగాణ బిజెపి చీఫ్ ఎన్.రామచందర్ రావుకు ఘన స్వాగతం పలికిన శ్రీరాములు అందెల
జూలై 25 మహేశ్వరం: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఎన్.రామచందర్ రావు తొలిసారి మహేశ్వరం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా *మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందెల శ్రీరాములు. జూలై 25 న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ తో కలిసి *తెలంగాణ బిజెపి చీఫ్ ఎన్.రామచందర్ రావు కి ఘన స్వాగతం పలికారు. సందర్భంగా నిర్వహించినటువంటి పత్రిక సమావేశంలో *ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పేరుతో ముస్లింలకు కేటాయిస్తున్న రిజర్వేషన్ ఎత్తివేస్తే బిజెపికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని అలాగే జడ్పీ చైర్ పర్సన్ ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం *బిజెపి కిసాన్ మోర్చా ఏపీఎంసీ కన్వీనర్ మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏనుగు రామ్ రెడ్డి నూతనంగా నిర్మించినటువంటి ఏ.ఆర్.ఆర్ రిసార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు గారు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సుధాకర్ శర్మ, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా సభ్యులు పాపయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి, కడారి జంగయ్య యాదవ్, కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు వీరకర్ణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్, డివిజన్ అధ్యక్షులు, యువ మోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకురాలు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.