వార్డ్ నెంబర్ గా గెలిచి రాజీనామా చేశారు ఆంగోతు రతన్
డిసెంబర్ 21 చారగొండ: డిసెంబర్ 17న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ నెంబర్ గా గెలిచిన రతన్ ఆంగోతు, తండ్రి ధర్మ మర్రిపల్లి గ్రామం. వార్డ్ నెంబర్ గా గెలిచిన తర్వాత రాజీనామా చేయడానికి కారణం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నానని తెలిపారు. తనకు రాజీనామా చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. తన రాజీనామా ఎంపీడీవో కార్యాలయానికి పత్రాన్ని పంపించారు. తన రాజీనామాను అంగీకరించవలసిందిగా కోరారు ఆంగోతు రతన్. గ్రామ సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని చెప్పారూ ఆంగోతు రతన్.