December 24, 2025

మహేశ్వరం ప్రజలందరికీ అడ్వాన్స్ 🎄క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు దేప భాస్కర్ రెడ్డి టిపిసిసి సభ్యులు

0
IMG-20251223-WA0540

మహేశ్వరం డిసెంబర్ 22: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ NTR నగర్ లో *ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన *సెమీ క్రిస్మస్ వేడుకల్లో* పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ *దేప భాస్కర్ రెడ్డి రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు *చిలుక ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. మీకు కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక *ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 👉ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రేమను, *కరుణను పంచడానికి జన్మించారు.* ఆయన బోధనలు కేవలం ఒక మతానికి పరిమితం కావు, అవి మానవాళి మొత్తానికి మార్గదర్శకాలు. 👉ద్వేషం ఉన్నచోట ప్రేమను, అశాంతి ఉన్నచోట శాంతిని నెలకొల్పడమే క్రిస్మస్ మనకు ఇచ్చే గొప్ప సందేశం.👉మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం నుంచి నేటి వరకు, క్రైస్తవ సోదరుల రక్షణకు, వారి సంక్షేమానికి మా పార్టీ పెద్దపీట వేసింది. 👉మన మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఈ పండుగ వేళ పేద కుటుంబాల్లో వెలుగులు నిండాలని నేను ఆశిస్తున్నాను. 👉ఈ పవిత్రమైన రోజున, మనమందరం కలిసి సమాజంలోని అసమానతలను తొలగించి, ఐకమత్యంతో ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో కొత్త ఆశలను, ఆయురారోగ్యాలను నింపాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed