ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. ఎం.ఎస్.ఆచార్య (మాడభూషి శ్రీనివాసాచార్య) గారి 101 వ జన్మదిన జ్ఞాపకం
Oplus_131072
అక్టోబర్ 3 హైదరాబాద్:ఎం.ఎస్.ఆచార్య గారు 1924, అక్టోబర్ 3వ తేదీన అమ్మమ్మ గారి గ్రామం సూర్యాపేటలో జన్మించారు. వారి తండ్రి ప్రసన్న రాఘవాచార్య గారు ఉభయ వేదాంత పండితులు. వారు నెల్లికుదురు గ్రామంలో వైద్యం చేసేవారు. నెల్లికుదురులోని మదరస తహానియాలో నాలుగో తరగతి వరకు ఉర్దూమీడియంలో చదువుకున్న ఎం.ఎస్.ఆచార్య తన తండ్రి వద్దనే బాలరామాయణం, ధాతుమంజరి, రఘువంశం, కుమారసంభవం మొదలైనవి నేర్చుకున్నారు.
…….
ఎం.ఎస్.ఆచార్య గారి అన్న గారు వెంకటనర్సింహాచార్యులు హిందూస్తానీ సంగీతం నేర్పిస్తూ ఆ డబ్బులతో కుటుంబాన్ని ఆదుకునేవారు. ఎం.ఎస్.ఆచార్య గారు కూడా చదువుకు స్వస్తిచెప్పి అప్పటి ప్రముఖ డాక్టర్ లక్ష్మణ్సా పవార్ వద్ద నెలకు రూ.12 వేతనానికి కాంపౌండర్గా ఉద్యోగంలో చేసారు. అలాగే ఓ ముడిసిల్క్ వ్యాపారి వద్ద కుడా రూ.15 వేతనానికి పని పసే వారు.
……
ఎం.ఎస్.ఆచార్య గారు 1942లో ఓసారి ఓ దుకాణం
ముందు ఒక వ్యక్తి, మరో వ్యక్తిని చితకబాదడాన్ని చూసి చలించిపోయిన ఆచార్య ఆ సంఘటనను వార్తగా రాసి సికింద్రాబాద్ నుంచి వెలువడుతున్న తెలంగాణ పత్రికకు పంపారు. తర్వాత 1947 జనవరి 1న ఆంధ్రపత్రిక ఏజెన్సీ తీసుకున్నారు.. 1948లో అదే పత్రికకు విలేకరిగా చేరి 32ఏళ్లపాటు పనిచేయడం జరిగింది. తెలుగు మాట్లాడితే నేరంగా పరిణించే నిజాం పాలనలో తెలుగు పత్రికకు సహసోపేతంగా వార్తలు రాసే విలేకరిగా పనిచేసారు. అప్పుడు ఆంధ్రపత్రికే ఉద్యమానికి ఊపిరి. ఉద్యమ వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టేవారు. అదే ఆయన ఉద్యమం ఉద్యోగం కూడా. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు
ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత
లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. వావిలాల గోపాలకృష్ణయ్య తెనాలిలో స్వాతంత్ర్యానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణాశిబిరంలో పాల్గొని పాత్రికేయ వృత్తి మెలకువలు నేర్చుకున్నాడు. పి.వి. నరసింహారావు, పాములపర్తి సదాశివరావు తదితరులు ప్రారంభించిన కాకతీయ పత్రికతో పాటు చిత్రవిచిత్ర మాసపత్రిక, ప్రగతి పత్రికలకు కూడా వారు వార్తలు వ్రాసేవారు.
…….
ఎం.ఎస్.ఆచార్య గారు 1958లో జనధర్మ వారపత్రికను స్థాపించారు. 1971లో స్వంత ముద్రణాలయం బాలాజీ ప్రెస్ను నెలకొల్పారు. 1980లో వరంగల్ వాణి అనే దినపత్రికను ప్రారంభించారు. జనధర్మను 36 సంవత్సరాల పాటు, వరంగల్ వాణిని 13 సంవత్సరాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి నడిపారు. తెలంగాణ సాహిత్యానికి, సాంస్కతిక వారసత్వానికి సముచిత గౌరవ ప్రాభవాలను కల్పించడానికి ఈ పత్రికల ద్వారా వేదికను ఏర్పరచారు. సామాజిక సమస్యలను చర్చించడానికి పరిశోధనాత్మక వార్తాంశాలను గుప్పించడానికి, సమకాలీన సంకర విలువలను ఎండగట్టడానికి ఈ పత్రికలు ఎంతో ఉపయోగపడినాయి. వ్యవస్థాగత సమస్యల వల్ల 1993లో వరంగల్వాణి దినపత్రికను అమ్మేశారు.
……
ఎం.ఎస్.ఆచార్య గారి సతీమణి రంగనాయకమ్మ గారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.రామానుజాచార్య కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యుడిగా పనిచేసి పదవీవిరమణ చేశారు. రెండవ కుమారుడు మాడభూషి శ్రీధర్ నల్సార్ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేసి ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషనర్గా తన పదవికాలాన్ని పూర్తి చేసి
ప్రస్తుతం మహీంద్రా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లా డీన్గా పనిచేస్తున్నారు.
……
పత్రికా నిర్వహణలో స్ఫూర్తిప్రదాతగా చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్.ఆచార్య గారు తన 71వ యేట జులై 12, 1994న మరణించారు. 2024 లొ వారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.