ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్
జూలై 11:తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.ఆరు వారాల్లోపు ఇంజినీరింగ్ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.దీంతో ఫీజుల పెంపు ఆశించిన కాలేజీలకు ఇది ఎదురుదెబ్బగా మారింది.