December 24, 2025

అల్కాపురి కాలనీలో కమ్యూనిటీ హాల్ లోని కనుమల్ల మురళీమోహన్ మెమోరియల్’ క్యారమ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి

0
IMG-20251221-WA1740

మహేశ్వరం డిసెంబర్ 21:మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన “కనుమల్ల మురళీమోహన్ మెమోరియల్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్” అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది. SR మీడియా వర్క్స్ మరియు సంజీవని సిస్టమ్స్ & సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందజేసి అభినందించారు. సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,> “యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతో దోహదపడతాయి. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయం. దివంగత కనుమల్ల మురళీమోహన్ జ్ఞాపకార్థం ఈ పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా అభినందనలు.” > కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, గట్ల రవీంద్ర,అల్కాపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వంశీ,sv శ్రీనివాస్, డాక్టర్ కిరణ్,కనుమల్ల రాజు, జ్ఞానేశ్వర్ యాదవ్, హంస భాస్కర్, కోటయ్య మరియు పురుషులు సింగిలు విజేతలు: కె. శ్రీనివాస్,రన్నరప్,ఎం.ఎ. హకీమ్,3వ స్థానం ఎస్. ఆదిత్య,4వ స్థానం గురుచరణ్ తాంబే,5వ స్థానం పి. మహేష్ కుమార్,6వ స్థానం ఎస్.కె. మొహమ్మద్ ఈ7వ స్థానం మొహమ్మద్ అహ్మద్.8వస్థానం:ఎల్. సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed