మీడియా మిత్రులకు అండగా ఉండాలి, వెంటనే ఎన్టీవీ రిపోర్టర్ లను విడుదల చేయాలి: మన ఊరి న్యూస్ ముఖ్య అధినేత మసున లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్ జనవరి 14: మీడియా అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి ఒక వంతెన లాంటివారు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి మరియు ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చూపించడం మీడియా ముఖ్య లక్షణం. సమస్యలేదైనా ఉంటే ప్రజలు మీడియాకి చెప్తారని డైరెక్ట్ గా వెళ్లి మంత్రులకు మరియు నాయకులకు చెప్పారని అన్నారు మసున లక్ష్మణ్ కుమార్ (మన ఊరి న్యూస్ అధినేత). NTV రిపోర్టర్లను అరెస్టు చేయడం చాలా బాధాకరమని వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు.