తొలి వన్డేలో భారత్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది
Oplus_0
జూలై 17 హైదరాబాద్:ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు వన్డేలోనూ అదే జోరు చూపింది. బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేయగా, టీమ్ఇండియా 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. దీప్తి శర్మ 64 బంతుల్లో 62 పరుగులు, 3 ఫోర్లు, ఒక సిక్స్తో చెలరేగింది.